Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సారా దుకాణాలను మళ్లీ తెరవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సారా నిషేధంపై ప్రశ్నలు
సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో మాట్లాడుతూ, తెలంగాణలో సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని జీరో అవర్లో లేవనెత్తుతానని తెలిపారు.
Read also: Women’s Day 2026: ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

ఆరోగ్యంపై వ్యాఖ్యలు
గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేవారని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తాగి చాలా మంది 80 ఏళ్లకే మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇతర రాష్ట్రాల ఉదాహరణ
మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలను నిర్వహిస్తున్నాయని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఈ విధానం ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: