हिन्दी | Epaper
2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

ఫిబ్రవరి 10 లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలి – సీఎం రేవంత్

Sudheer
ఫిబ్రవరి 10 లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలి – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేందుకు అధునాతన విధానాన్ని రూపొందించాలని సీఎం సూచించారు. ముఖ్యంగా ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో భక్తుల రద్దీ పెరుగుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాలను మెరుగుపర్చాలని తెలిపారు.

అదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రదేశాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి అందాలను పర్యాటక ఆకర్షణలుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అటవీ, పర్యాటక, రెవెన్యూ శాఖలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్‌లను కలుపుతూ ఒక ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. సింగపూర్ తరహాలో ఆధునిక ఎకో టూరిజం విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి మరింత ఆదాయం వచ్చేలా, తెలంగాణను దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తించుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పర్యాటక వృద్ధి కోసం తగిన ప్రణాళికలు రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870