సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ (Sigachi in Pashamilaram Accident) పరిశ్రమ ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. దాదాపు 40 మంది కార్మికులు ఈ ఘోర ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పటికీ 9 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు (9 workers missing). అధికారిక ప్రకటనల ప్రకారం, వీరు పూర్తిగా గల్లంతయ్యారని జిల్లా కలెక్టర్, కంపెనీ యాజమాన్యం తెలిపారు.ప్రమాద ప్రాంతంలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తయింది. అంతా ఎక్కడికక్కడ జల్లెడలాగా గాలించారు. అయినా గల్లంతైన కార్మికుల పట్ల స్పష్టత రాలేదు. వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చని సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడుతోంది.

కుటుంబాల్లో కలకలం – ప్రభుత్వంపై ఆగ్రహం
ఇంతవరకూ స్పష్టత లేకపోవడం కుటుంబాలను ఆవేదనలోకి నెట్టింది. బాధిత కుటుంబాలతో ఐలా భవనంలో సమావేశమైన సీఎస్ను, “మా పరిస్థితి ఏంటి?” అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తమ కుటుంబీకులు మరణించారని అంగీకరించిన అధికారులు, “అందరికీ న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు.సమావేశం అనంతరం కొన్ని కుటుంబాలు జిల్లా కలెక్టర్ కాళ్లపై పడుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో గందరగోళం
లాకర్ రూంలో లభించిన సెల్ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు. గల్లంతైన కార్మికుల మృతదేహాలు లభించకపోతే, పరిహారం విషయంలో అనేక శంకలు ఎదురవుతున్నాయి.ఇప్పటికీ ప్రభుత్వం గల్లంతైన వారిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎస్ సైతం దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత ఆలస్యం కాకముందే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read Also : BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా? – ఖర్గే