हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana : సోషల్ మీడియా లో అసభ్యకర వీడియోలు పోస్ట్.. 15 మంది అరెస్ట్

Sudheer
Telangana : సోషల్ మీడియా లో అసభ్యకర వీడియోలు పోస్ట్.. 15 మంది అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా(Social media)లో అసభ్యకర చైల్డ్ పోర్న్ వీడియోలు పోస్టు చేస్తున్న ఘటనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TCSB) అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి, వివిధ ప్రాంతాల్లో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్లో కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ వెల్లడించారు. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి కార్యకలాపాలను ప్రభుత్వ యంత్రాంగం సహించదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై నిఘా

డీజీ శిఖా గోయెల్ తెలిపిన వివరాల ప్రకారం, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కంటెంట్‌ను షేర్ చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టబడింది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను గమనించి, తగిన ఆధారాలతో కలిసి చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్నపిల్లలకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు షేర్ చేయడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, పోక్సో చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఇటువంటి నేరాలపై ప్రభుత్వం ‘జీరో టోలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తుందని హెచ్చరించారు.

డిజిటల్ నేరాలపై ప్రజలకు జాగ్రత్త అవసరం

ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, డిజిటల్ నేరాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అసభ్యకర కంటెంట్‌ను షేర్ చేయడం అత్యంత భయంకరమైన నేరం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించాలనీ, ఏవైనా అసభ్య వీడియోలు గమనించినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంది అని డీజీ శిఖా గోయెల్ స్పష్టం చేశారు.

Read Also ; Law Set Results : లా సెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ ఎమ్మెల్యే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870