ఇప్పటి వరకు రూ.80,453.41 కోట్లు
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలుచేసేందుకు సన్నాహాలు చేపడుతోందని, ఏ ఒక్క రైతును తగ్గించే ఆలోచన తమకు లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. అసెంబ్లీలో శనివారం రైతుభరోసాపై స్వల్పవ్యవధి చర్చలో 12 సీజన్లలో రూ. 80,453,41 కోట్లు రైతు బంధు గత ప్రభుత్వం విడుదలచేసిందని తెలిపారు. గత ప్రభుత్వం 2017-18లో రైతుబండు పథంక తీసుకొచ్చిందని తొలుత ఎకరాకు నాలుగు వేలు ఇచ్చేవారని 2018-19లో ఎకరాకు ఐదువేలకు పెంచారని ఆయన తెలిపారు. ఇందులో 2023-24లో రూ.7,625.14 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని ఆయన వివరించారు. ధరణి పోర్టల్లోని భూమి హక్కుల రికార్డుల ఆధారంగా రైతుబందు గత ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. భూమి ఉన్నవారు, సాగు చేసినా చేయకపోయినా రైతుబంధుకు అర్హులయ్యారని ఆయన విమర్శించారు. జీవో 231 ప్రకారం సాగుచేసే రైతులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ సుమారు 22,606కోట్లు 11 సీజన్లలలో రాళ్ళ రప్పలు రియల్ఎస్టేట్ భూములు, సాగుచేయని భూములకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇది సక్రమంగా అమలు చేసేందుకు.. విదివిధానాలు నిర్ణయించేందుకు కెలినెట్ సభ కమిటి వేయడం జరిగిందని తెలిపారు. పీఎం కెసానీయోజన పథరం విధివిధానాలు కూడా పరిశీలించామని తెలిపారు. ఈ కమిటీ పదిజిల్లాలో అనేక మంది రైతులను మేధావులను కలిసి సలహాలు సూచనలు తీసుకొనివిరివిధాలను తయారుచేస్తోందని అన్నారు. ప్రభుత్వం జనవరిలో అమలు చేయతలపెట్టిన ఈ పథకం సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటిని క్రోడికరించి తుది విధివిధానాలు రూపొందించి సంక్రాంతి నుంచి రైతుభరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైనామని ఆయన అన్నాడు. రైతుబంధు అమలు చేసిన విధానంలో వ్యవసాయశాఖకు లబ్దిదారుల పేర్లను మార్చడం జరిగిందన తెలిపారు. సీసీఎల్ఏ నుంచి అందిన భూవిస్తీర్ణంలో మార్పులు చేయడానికి అనుమతి లేదని, పట్టాదారుల బ్యాంకు ఖాతాలను సేకరించి రైతు పోర్టలు అప్సేట్ చేస్తున్నామని తుమ్మల చెప్పారు.
రైతుబంధు పేరుతో 22,606కోట్లు దుర్వినియోగం
- పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ యోగ్యతలేని భూములకు కూడా రైతుబంధు ప్రభుత్వం వర్తింపచేసి రూ.22,600కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేబిలేసిన భూములు, బిఆర్ఎస్ కార్యకర్తలు కొత్తగా పాస్ ుక్కులు సృష్టించుకొనిలేని భూములకు కూడా రైతుబుడు చెల్లించారని ఆరోపించారు.మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం’ అని సంవత్సరకాలంలో 21వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పరిధాన్యంరైతును మిల్లర్లతో కలిసి దోచుకొన్నరని దుయ్యబట్టారు. రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం సెంటర్ల రోజపరేటివ్ సెంటర్లు పెట్టి దాన్యం కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు. మేదా సన్నధాన్యండు బోనస్ చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. రైతుబంధు స్వరోగ నివారణి అన్నట్లుగా వ్యవహరించారని ఎద్దేవాచేశారు.