Telangana MPs meeting ongoing at Praja Bhavan

ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలంగాణ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే సమావేశానికి బీఆర్ఎస్ , బీజేపీ దూరంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క సమావేశం నిర్వహిస్తున్నారు.

Advertisements
 ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలంగాణ ఎంపీల

మీ ఆహ్వానానికి ధన్యవాదాలు

అఖిలపక్ష భేటీకి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సమావేశానికి రావడం లేదని భట్టికి కిషన్‌రెడ్డి ఇవాళ లేఖ రాశారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ప్రాధాన్యత కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమనే విషయం మీకు తెలిసిందే. కానీ బీజేపీ ఎంపీలందరికీ నిన్న రాత్రి ఆలస్యంగా ఈ సమాచారం అందింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా మా ఎంపీలందరికీ వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతోపాటు ముందుగా నిర్ణయించిన అధికార, అనధికార కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేం హాజరుకాలేకపోతున్నాం.

అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజ

భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందుగానే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాం. అని లేఖలో పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరు అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పార్థసారథి, దామోదర్‌రావు, కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరికి కూడా ఆహ్వానం వెళ్లనప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related Posts
శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
Student suicide in Sri Chaitanya College

హైదరాబాద్‌: షాద్ నగర్ కు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే Read more

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని Read more

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం..కీలక చర్చలు
Congress working committee meeting today.important discussions

న్యూఢిల్లీ: నేడు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ Read more

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌
We have not received a response from India to our request.. Yunus

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక Read more

Advertisements
×