తెలంగాణ (Telangana) రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తండ్రిగా ఉన్న వ్యక్తి తన భార్యను వదిలి ఒక ట్రాన్స్ జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
2014లో వివాహం.. ఇద్దరు పిల్లల తల్లి లాస్య
జగిత్యాల (Jagtial) పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్, 2014లో పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అనూహ్యంగా గత కొన్ని నెలలుగా రాజశేఖర్, హైదరాబాద్కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపు (Transgender Deepu) తో సంబంధం పెంచుకున్నాడు.
భార్యను వదిలి.. దీపుతో సహజీవనం
ఈ సంబంధాన్ని కొనసాగిస్తూ, రాజశేఖర్ తన భార్యను వదిలిపెట్టి దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
హాస్పిటల్ కు రాని భర్త.. అత్తమామల ఆవేదన
లాస్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, భర్త రాజశేఖర్ హాస్పిటల్కి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురై రాజశేఖర్ను వెతకడం ప్రారంభించారు.
ట్రాన్స్ జెండర్తో కలిసి ఇంట్లో పట్టుబడిన రాజశేఖర్
ఈ క్రమంలో రాజశేఖర్ తన ఇంట్లో ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్నట్లు గుర్తించి, వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వెంటనే వారు రూమ్కి తాళం వేసి, పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్ మరియు దీపును స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read also: Clinic cheating: ఘోరం..బిచ్చగాళ్ల వీర్యం దోపిడీ చేస్తున్న ఘరానా క్లినిక్