Telangana Inter Board good news for students

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ప‌రీక్ష రాస్తున్న విద్యార్థులు ఇప్ప‌టికే సీరియ‌స్‌గా ప్రిపేర్ అవుతున్నారు. కొంద‌రు ట్యూష‌న్లు పెట్టించుకుని మ‌రీ చ‌దువుతుంటే.. మ‌రికొంత మంది గ్రూప్ స్ట‌డీస్ చేస్తూ కస‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు పలు కీల‌క‌ నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల‌కు అందించిన‌ హాల్ టికెట్స్‌లో 15 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ల‌ గేట్లు మూసివేస్తారని నిబంధన ఉన్నప్పటికీ.. ఆ రూల్‌ను ఖచ్చితంగా అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

Advertisements
విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు

నిమిషం నిబంధన ఎత్తివేత..

ఒక్క నిమిషం నిబంధన అనేది అమలు చేయడం లేదని.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇది విద్యార్థుల‌కు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొంత‌మందికి ఎగ్జామ్ సెంట‌ర్ చాలా దూరంగా ప‌డుతుంది. గంట‌ల స‌మ‌యం ముందే బ‌యలుదేరినా.. ట్రాఫిక్ కార‌ణంగానో లేదా ఇత‌ర కార‌ణాల‌తో సెంట‌ర్‌కు రీచ్ అవ్వ‌లేక‌పోతారు. అప్పుడు ఎగ్జామ్ రాయ‌నివ్వ‌క‌పోతే విద్యార్థి భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు

కాగా ,ఇంటర్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 9,96,541 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులు 4,88,316 ఉండగా, సెకండియర్‌ విద్యార్థులు 5,08,225 మంది ఉన్నారు. మ‌రోవైపు, పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలులో ఉంటుందని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. ఇప్పటికే పరీక్షా పత్రాలు ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి.

Related Posts
తెలంగాణ‌లో రెండు రోజులు వ‌ర్షాలు
rain alret

తెలంగాణ‌లో రెండు రోజులు వ‌ర్షాలు పడేఅవకాశం వుంది. నిన్న నుంచి హైదరాబాద్ మబ్బులతో ముసురుకుంది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో గురు, శుక్ర‌వారాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు Read more

భాగ్యనగర వాసులకు తాగునీటి సరఫరాలో అంతరాయం
drinking water

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని నివాసితులకు ఫిబ్రవరి 1వ తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. నసర్ల పల్లి సబ్‌స్టేషన్‌లోని 132 కెవి బల్క్ లోడ్ ఫీడర్ పిటి వద్ద Read more

Satyakumar Yadav: నిర్మలా సీతారామన్‌తో సత్యకుమార్ భేటీ
Satyakumar Yadav: నిర్మలా సీతారామన్‌తో సత్యకుమార్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం Read more

చట్టం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగవు : శ్రీనివాస్‌ గౌడ్‌
No increase in reservation for BCs without legislation. Srinivas Goud

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ..బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం Read more

Advertisements
×