BRS MLC kavitha

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత, ప్రభుత్వ హామీల అమలు అంశాల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ఆమె విమర్శించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సొంత లాభాల కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణ పరిస్థితుల్లో ఉంది. ప్రతి మూడు గంటలకోసారి లైంగిక దాడి జరుగుతుండటం బాధాకరం” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దుష్టపాలనతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రగతిశీల తెలంగాణ కోసం కేసీఆర్ శ్రమించి సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు నాశనం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా, వారి నమ్మకాలను ద్రోహం చేస్తున్నారు అని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించిన కవిత, “కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ తీరుపై ప్రశ్నించాలని, వారికి బదులు చెప్పించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. కాంగ్రెస్ హామీలను గాలికొదిలేసి, ప్రజల నమ్మకాన్ని వంచిస్తున్నారు. ప్రజలు తక్షణమే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి అని ఆమె పేర్కొన్నారు.

Related Posts
పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు బ్యాన్
పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు బ్యాన్

ఇటీవల హైటెక్ యుగంలో, టెక్నాలజీ పరిజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండటంతో, విద్యార్థులు పరీక్షలు రాయడానికి కాపీయింగ్ పద్ధతులను కొత్త సాంకేతికతతో చేప్పించుకుంటున్నారు. ఇక ఇప్పుడు, తెలంగాణ ఇంటర్ Read more

అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన !
Prime Minister Modi visit to Amaravati!

న్యూఢిల్లీ: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం Read more

నకిలీ కాల్ సెంటర్ యజమాని అరెస్ట్
నకిలీ కాల్ సెంటర్ యజమాని అరెస్ట్ – పోలీసులు కలకలం

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ సైబర్ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, అమెరికన్లను టార్గెట్ చేస్తూ హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరి Read more

దావోస్ వేదికపై తెలంగాణ సరికొత్త రికార్డు
TG secures Rs 45,000 crore

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త మైలురాయిని సాధించింది. రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడుల Read more