దావోస్ పర్యటన లో సీఎం రేవంత్ బృందం సత్తా చాటుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు చూస్తే…

- యూనిలీవర్ సంస్థ కామారెడ్డిలో పామాయిల్ కేంద్రం ఏర్పాటు
- స్క్వేర్ రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ 500 కోట్లు పెట్టుబడి
- 11 వేల కోట్ల పెట్టుబడుల తో మెగా సంస్థ 2160 మెగా వాట్లతో పంపు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి కేంద్రం ద్వారా 1250 ఉద్యోగాలు
- 3000 కోట్లతో బ్యాటరీ ఎనర్జీ కేంద్రం 4000 ఉద్యోగాలు
- 1000 కోట్లతో పర్యావరణ రంగం లో పెట్టుబడి
- కంట్రోల్ ఎస్ సంస్థ AI ఆధారిత డాట క్లస్టర్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు
ఎస్ సంస్థ పదివేల కోట్ల పెట్టుబడి 3600 మందికి ఉపాధి - HCL కొత్త టెక్ క్యాంపస్
- హైదరాబాద్లో విప్రో విస్తరణ
- గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ద్వారా 5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు
- రూ.800 కోట్లతో అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జేఎస్ డబ్ల్యూ
- రూ.45500 కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల నెలకొల్పనున్న సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడులకు ఒప్పందం.. 7000 ఉద్యోగాలు
- గోపనపల్లి లో విప్రో కొత్త క్యాంపస్ , ప్రత్యక్షంగా పరోక్షంగా 5000 మందికి ఉద్యోగ అవకాశాలు
- పోచారంలో ఇన్ఫోసిస్ సేవలు విస్తరణ ద్వారా 17వేల మందికి ఉపాధి అవకాశాలు , మొదటి దశగా 750 కోట్లు పెట్టుబడి
- అలాగే అమెజాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో 60 వేల కోట్ల పెట్టుబడులు