Telangana government gives good news to Muslims

Ramadan Festival: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Ramadan Festival: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ఉండనుండగా తర్వాత రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. గత ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో బోనాల పండుగ తర్వాతి రోజు, క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు, రంజాన్ పండుగ తర్వాతి రోజు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ

ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం

ప్రస్తుత ప్రభుత్వం కూడా దానినే కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఏపీలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక్కరోజే సెలవు ఉండనుంది. ఇక రేపు (మార్చి 28) జమాతుల్-విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కాలేజీలు, స్కూళ్లు యథావిధిగా పని చేయనున్నాయి. రేపు ముస్లిం మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రభావం ఉంటుంది. వరుస పండగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు

రేపటి నుంచి ఒక్క శనివారం(మార్చి 29) మినహా బుధవారం మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. మిగతా వారికి మార్చి 30 ఉగాదితోపాటు.. ఆదివారం కావడం, తర్వాతి రోజు రంజాన్, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి విద్యార్థులకే కాదు.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా అవకాశం ఏర్పడింది.

Related Posts
క్రెడిట్ కార్డ్ 30% వడ్డీపై సుప్రీం కోర్టు తీర్పు
క్రెడిట్ కార్డ్ 30% వడ్డీపై సుప్రీం కోర్టు తీర్పు

క్రెడిట్ కార్డ్ బకాయిలపై బ్యాంకులు 30% కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేయవచ్చు: సుప్రీం కోర్టు తీర్పు సుప్రీంకోర్టు, బ్యాంకులు అధిక క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను Read more

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు: ప్రభుత్వం ప్రకటన
55 Crore People Bath in Kum

మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల Read more

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
accident ADB

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు Read more

1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగింపు!

2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *