India cricket player Gongadi Trisha with Telangana Chief Minikster Revanth Reddy

త్రిషకు తెలంగాణ సీఎం కోటి నజరానా.

అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. అటు బ్యాటింగ్‌లో,ఇటు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష.. 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా త్రిష (309) నిలిచింది. అందులో ఒక సెంచరీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది. ఈ క్రమంలోనే త్రిష… ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది.ప్రపంచ కప్ విజయం తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతిలకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు.. క్రికెటర్లకు శాలువాలతో సన్మానం చేశారు. వీరితో పాటు టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ నౌషిన్‌ అల్‌ ఖదీర్‌, ట్రైనర్‌ షాలినిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన త్రిషను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisements
1887930 telanganacmrevanthreddy

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో భాగమైన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. వివరాలు.. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున ఆయన నివాసంలో క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. త్రిషను శాలువాలతో సత్కరించారు. ఆమె భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు.

Related Posts
Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్
Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ముగింపు – మూల్యాంకనం ప్రారంభం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు గురువారం (మార్చి 20)తో Read more

New DGP of Telangana : తెలంగాణ కొత్త DGP ఎవరు?
dgp jitender

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖకు సంబంధించిన కీలక మార్పు జరగనుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో వచ్చే నెలలలో Read more

ఎమ్మెల్సీ క‌విత కాంగ్రెస్, బీజేపీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ పార్టీలు ప్రజలకు సరైన పాలనను అందించడంలో విఫలమైనాయని Read more

Revanth Reddy: సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ టీమ్
Revanth Reddy: సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ టీమ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో భాగంగా రెండు కీలక కంపెనీలతో చర్చలు జరిపి, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై Read more

×