Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Amaravati : పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ దిశగా ‘జీరో పావర్టీ పీ-4. మార్గదర్శి-బంగారు కుటుంబం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పేదరికాన్ని నిర్మూలించేందుకు పనిచేయనున్నారు.ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisements
Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
Amaravati పీ 4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. అలాగే, పీ-4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ (swarnaandhrap4@ap.gov.in)ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. అదే విధంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని కుటుంబాలను ఎంపిక చేసి, వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ పథకం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలు ఈ పథకంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

Related Posts
అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లో సేవలు ప్రారంభం : రామ్మోహన్‌ నాయుడు
Sea plane fares available to all. Services to start in 3 months. Rammohan Naidu

విజయవాడ: నేడు విజయవాడ - శ్రీశైలం మధ్య "సీ ప్లేన్" ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ Read more

Chandrababu Naidu : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం

Chandrababu Naidu : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త Read more

Mithun Reddy : ఎంపీ మిథున్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తున్న సిట్‌ అధికారులు
SIT officials are interrogating MP Mithun Reddy at length

Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మద్యం కుంభకోణం కేసులో సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడలో సిట్‌ కార్యాలయానికి ఆయన ఈరోజు ఉదయం వచ్చారు. అనంతరం Read more

Vizag Steel Plant : విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులకు సెలవులు రద్దు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్య నిర్ణయానికి నిరసనగా కార్మిక సంఘాలు స్పందించాయి. ఈ నెల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×