అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్లో తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. అటు బ్యాటింగ్లో,ఇటు బౌలింగ్లో సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష.. 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా త్రిష (309) నిలిచింది. అందులో ఒక సెంచరీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది. ఈ క్రమంలోనే త్రిష… ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.ప్రపంచ కప్ విజయం తర్వాత హైదరాబాద్కు చేరుకున్న క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతిలకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు.. క్రికెటర్లకు శాలువాలతో సన్మానం చేశారు. వీరితో పాటు టీమ్ఇండియా చీఫ్ కోచ్ నౌషిన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన త్రిషను ప్రత్యేకంగా అభినందించారు.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. వివరాలు.. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున ఆయన నివాసంలో క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. త్రిషను శాలువాలతో సత్కరించారు. ఆమె భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు.