Telangana– బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు మార్గదర్శక రాష్ట్రం
హైదరాబాద్ : Telangana వెనుకబడిన తరగతుల వర్గాల కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా Telangana నిలిచిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శంషాబాద్లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో చారిత్రాత్మకమైన కుల గణన సర్వేను లక్ష మందికి పైగా ఉద్యోగుల సాయంతో నిర్వహించడం దేశంలో మోడల్గా నిలిచిందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ప్రశంసించారని తెలిపారు.కుల గణన అనంతరం జరిగిన ప్రక్రియలో సబ్ కమిటీ, బీసీ డెడికేటెడ్ కమిషన్ల చొరవతో అన్ని మార్గాలను క్రమబద్ధంగా అనుసరించినట్టు మంత్రి వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ‘యాక్ట్ 2, 3’ చట్టాల రూపంలో శాసనసభలో ఆమోదించి, గవర్నర్కి పంపించినట్టు చెప్పారు. ఏప్రిల్ 8న ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయని తెలిపారు.
Telangana: బీసీ రిజర్వేషన్ – దేశానికి మార్గదర్శక మోడల్
ఈ బిల్లులకు సుప్రీంకోర్టు కూడా రెండు నెలల్లో తేల్చాలని సూచించిన నేపథ్యంలో, రాష్ట్రపతి నుండి సానుకూల స్పందన వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై శాసనసభలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం వల్ల న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. కుల గణన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, సమాచార సేకరణలో ప్రభుత్వ శాఖలు సజావుగా పనిచేశాయని వివరించారు.

బీసీ రిజర్వేషన్కు రాజకీయ పార్టీల ఏకగ్రీవ మద్దతు
Telangana రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులను చేర్చుకొని చారిత్రాత్మకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని తెలిపారు. 1931 తర్వాత దేశంలో మొదటిసారిగా ఇటువంటి కుల గణన జరుగడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు కుల గణనపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు తమ తమ స్థాయిలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.దేశవ్యాప్తంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రాధాన్యతతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతును మరింత పెంచే అంశమవుతుందని మంత్రి తెలిపారు.
Read more :
Donald Trump: ట్రంప్-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!