25న ధర్నాచౌక్ న్యాయవాదుల న్యాయదీక్ష హైదరాబాద్ : న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఈనెల 25న న్యాయవాదుల న్యాయ దీక్ష చేపడుతున్నారు. శుక్రవారం తెలంగాణ (Telangana) జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులపై జరిగే ఇటీవల దాడులు పెరుగు తున్నాయి. వీరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ లాగా ఇక్కడ కూడా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక యాక్ట్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు సుమారు మూడు లక్షల వరకు వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. జూనియర్ అడ్వకేట్లకు 15వేలు స్టైఫండ్ ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

Telangana
జక్కుల వంశీకృష్ణ, గుజ్జ కృష్ణ తదితరులు
జుడిషియల్ కమిషన్ ద్వారా జడ్జిలను తెలంగాణ (Telangana) జూనియర్ అడ్వొకేట్ అసోసియేషన్ సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభసభ్యుడు ఆర్.కృష్ణయ్య, (R. Krishnaiah) చిత్రంలో అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, గుజ్జ కృష్ణ తదితరులు న్యాయదీక్ష సన్నాహక సమావేశానికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 25న జరిగే న్యాయవాదుల న్యాయ దీక్ష వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. న్యాయవాద వృత్తి పవిత్రమైనది, సున్నితమైనది. తెగింపు, సహసోపేతమైన వృత్తి. న్యాయమైన న్యాయ సమస్యలపై త్వరలో సిఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ (Jakkula Vamsi Krishna) మాట్లాడుతూ నాయం కోసం పాటుపడే న్యాయవాదులకే రక్షణ లేదన్నారు.
న్యాయవాదులు ఎప్పుడు న్యాయదీక్ష చేపడుతున్నారు?
ఈనెల 25న ధర్నాచౌక్ వద్ద న్యాయదీక్ష చేపడుతున్నారు.
న్యాయదీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారు?
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: