టెడ్రోస్ మాట్లాడుతూ, “మరో మహమ్మారి .కానీ అది ఎప్పుడొచ్చేది మాత్రం చెప్పలేం.రేపే రావచ్చు పదేళ్ల తర్వాతా రావచ్చు,” అంటూ చెప్పారు. అందుకే ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ఇప్పుడు నుంచే సన్నద్ధంగా ఉండాలని సూచించారు.ఈ వ్యాఖ్యలు జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ 13వ పునఃప్రారంభ సమావేశంలో వెలువడ్డాయి.ఈ సమావేశం పాండెమిక్ అగ్రిమెంట్పై నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఆయన కరోనా వల్ల వచ్చిన పరిణామాలను గుర్తు చేశారు.

కరోనా ప్రభావం ఇంకా తేలిపోయిందా?
“కరోనా ఇంకా పూర్తిగా ఆగలేదు.అలాగే భవిష్యత్లో వచ్చే మహమ్మారి అంతకంటే ప్రమాదకరమవుతుంది, అని టెడ్రోస్ స్పష్టం చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మరణించారని తెలిపారు. కానీ వాస్తవికంగా చూస్తే ఈ సంఖ్య 2 కోట్లు దాటొచ్చని భావిస్తున్నారు.
భారతదేశానికి ఈ హెచ్చరిక ఎంత ముఖ్యమో తెలుసా?
భారత్లో కరోనా సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆక్సిజన్ కొరత ఆసుపత్రులలో బెడ్లు లేకపోవడం వంటి సమస్యలు చూశాం.అప్పుడు తీసుకున్న పాఠాలు ఇప్పుడు ముందుగానే అప్రమత్తం కావడానికే ఉపయోగపడతాయి.కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.టెడ్రోస్ తెలిపిన ప్రకారం, ప్రపంచానికి దాదాపు 10 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది.ఇది ఎన్నో దేశాల అభివృద్ధిని వెనక్కి తోసేసింది.ప్రతి దేశం తన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి.సరైన పథకాలు రూపొందించుకోవాలి.ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.ప్రభుత్వాలు, ప్రజలు కలిసే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి.తద్వారా వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
READ ALLSO : Health: తరచుగా తల తిరిగినట్లు అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలు మీకోసమే