Technical problem on Instagram.. disruption in services

Instagram: ఇన్‌స్టాలో సాంకేతిక సమస్య.. సేవల్లో అంతరాయం

Instagram : ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌ ‘ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. గురువారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి లాగిన్‌, సర్వర్‌ కనెక్షన్‌ వంటి సమస్యలు తలెత్తాయి.

ఇన్‌స్టాలో సాంకేతిక సమస్య సేవల్లో

యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు

ప్రముఖ టెక్ ట్రాకింగ్ వెబ్ సౌట్ డౌన్‌ డిటెక్టర్‌ ప్రకారం 72 శాతం శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు ఎదుర్కోగా.. 24 శాతం మంది సర్వర్‌ కనెక్షన్‌ ప్రాబ్లమ్‌ను నివేదించారు. దీంతో యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ ద్వారా పంచుకున్నారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం

ఇక, ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన ‘ఎక్స్’ (X) డౌన్ అయిన విషయం తెలిసిందే. ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం కలగడం గమనార్హం. తమ సామాజిక మాధ్యమంపై అతిపెద్ద సైబర్‌ దాడి జరిగిందని మస్క్‌ పేర్కొన్నారు. దీని వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్‌ లేదా ఒక దేశ హస్తం ఉందన్నారు. ఈక్రమంలోనే దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని మస్క్‌ అనుమానాలు వ్యక్తంచేశారు. సైబర్‌ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్‌ ప్రాంతానికి చెందినవేనని తెలుస్తోందన్నారు.

Related Posts
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ మళ్లీ వార్నింగ్
trump

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో డాలర్‌ను వినియోగించడం మానేస్తే, అమెరికా వాటిపై 100 శాతం పన్నులు విధిస్తుందని ట్రంప్ Read more

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ సమావేశంలో కుల గణన మరియు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం Read more

ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు
delhi national security

ఈ నెల 16న న్యూఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమెరికా, కెనడా, బ్రిటన్ సహా దాదాపు 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు Read more

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి
chandrababu daggubati ven

దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులు అయిన నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *