అంతరిక్షంలో మనిషి స్థిరంగా ఉండాలంటే నీరు, ఆక్సిజన్, ఇంధనం తప్పనిసరి. అయితే ఇవన్నీ భూమి నుంచి తీసుకెళ్లడం చాలా ఖరీదైన వ్యవహారం. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు కనిపిస్తోంది. చైనా శాస్త్రవేత్తలు (Chinese scientists) అందుకు గట్టి అడుగు వేశారు.చైనా యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, షెన్జెన్కు చెందిన లు వాంగ్ నేతృత్వంలో జరిగిన తాజా పరిశోధన ఆశ్చర్యకర ఫలితాలను చూపింది. చంద్రుని మట్టిలోని ప్రత్యేక గుణాల ఆధారంగా, అందులోని నీటిని వెలికితీసి, దానిని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్తో పాటు ఇంధన సంబంధిత పదార్థాలుగా మార్చగలిగారు.

నీరు రాకెట్లో తీసుకెళ్లితే ఖర్చు ఎంతంటే…
ఈ అధ్యయనం ప్రకారం, చంద్రుని (Moon)కి ఒక్క గ్యాలన్ నీరు తీసుకెళ్లాలంటే దాదాపు 83,000 డాలర్లు ఖర్చవుతుంది. అంతరిక్షయాత్రికులు ఒక్క రోజు నలుగురు గ్యాలన్లు నీరు ఉపయోగిస్తారని గణన. అందుకే చంద్రునిపైనే ఈ అవసరాలను తీర్చే మార్గాలపైన శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు.మునుపటి సాంకేతిక పద్ధతులు ఎక్కువ శక్తిని వినియోగించేవి. పైగా CO2ను ఉపయోగించి ఇంధనం తయారుచేయలేకపోయేవి. కానీ ఈ కొత్త విధానం ఆ లోపాలను అధిగమించిందని పరిశోధకులు వెల్లడించారు. ఇది చంద్రునిపై స్థిరమైన నివాసాల ఏర్పాటుకు పెద్ద ఊతమని అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఉన్న సవాళ్లేంటంటే…
ఇప్పటికీ చంద్రుని వాతావరణం చాలా కఠినం. మట్టిలోని నిర్మాణం కూడ భిన్నంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిధులు పరిమితంగా ఉన్నాయి. అయినా ఈ అవాంతరాలను అధిగమిస్తే, చంద్రునిపై మనిషి జీవించడం ఇక కల కాదు అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కొత్త ఆవిష్కరణ అంతరిక్ష ప్రయాణాల్లో కొత్త దారులను తెరుస్తోంది. భవిష్యత్లో చంద్రునిపై మనిషి శాశ్వతంగా నివసించేందుకు ఇది కీలక మెట్టు కావొచ్చు.
Read Also : Donald Trump: వాల్ స్ట్రీట్ జర్నల్పై పరువునష్టం దావా వేసిన ట్రంప్