దేశీయ టెక్ రంగంలో మరో కొత్త అధ్యాయానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నాంది పలికారు ఇటీవల ఆయన వీవీడీఎన్ టెక్నాలజీస్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్లెట్కు సంబంధించి జరిగిన అనూహ్య పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వీవీడీఎన్ టెక్నాలజీస్ సంస్థ తయారుచేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నాణ్యతను మంత్రి వ్యక్తిగతంగా పరిశీలించారు. ముఖ్యంగా, స్వదేశీ ట్యాబ్ పై ఆయన ఆసక్తి చూపారు. అధికారులు దీనిపై ఇచ్చిన వివరాలు వినగానే మంత్రి కొంతంత తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ట్యాబ్ కింద పడినా, దానిపై ఎవరైనా నిలబడ్డా ఏమీ కాకపోతుందన్నారు. అదే విషయాన్ని తన కళ్లతో చూసేందుకు మంత్రి వేదికపై ఉన్న ట్యాబ్ను నేలపై విసిరారు.

ఆ తర్వాత, దానిపై తానే నిలబడి మన్నికను పరీక్షించారు.ఈ హఠాత్ చర్యను అక్కడున్న అధికారులు ఆశ్చర్యంగా చూసారు.కానీ, ట్యాబ్ మాత్రం ఏమాత్రం నష్టపోలేదు. ఇది చూసిన వెంటనే మంత్రి చిరునవ్వుతో స్పందిస్తూ, “ఇది పగలదు” (It doesn’t break) అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఆయన తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.వీవీడీఎన్ టెక్నాలజీస్ పర్యటన సందర్భంగా మంత్రి వైష్ణవ్ మరిన్ని ముఖ్యమైన అభివృద్ధులను పరిశీలించారు. భారత్లోనే పూర్తిగా తయారైన ‘అడిపోలి’ అనే అత్యాధునిక ఎఐ సర్వర్ను పరిశీలించారు. ఈ సర్వర్ భారతదేశం కృత్రిమ మేధ లో దూసుకెళ్లే దిశగా తీసుకెళ్లనుంది.ఈ సంఘటనలు మన దేశంలో తయారవుతున్న ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంచుతున్నాయి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ట్యాబ్ అంత మన్నికగా ఉండటం వలన, విదేశీ బ్రాండ్లను తలదన్నే స్థాయిలో మన ఉత్పత్తులు ఉన్నాయని నిరూపితమవుతోంది.ఈ సందర్భంగా ఐటీ మంత్రి మాట్లాడుతూ, “భారతదేశం ఇప్పుడు టెక్నాలజీ తయారీ కేంద్రంగా మారుతోంది. స్వదేశీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలవు. ఈ మార్పు మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు.మొత్తానికి, వీవీడీఎన్ టెక్నాలజీస్ తయారుచేసిన ట్యాబ్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై మంత్రి వైష్ణవ్ చేసిన రివ్యూ సాక్షిగా దేశీయ టెక్నాలజీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also : Infosys : రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ ట్రైనీలను తొలగింపు