భారతదేశ ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)’ తమ ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో నైపుణ్యం కలిగించేందుకు భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంస్థ సీటీఓ హారిక్ విన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి సంవత్సరం కనీసం ‘లక్ష మంది ఉద్యోగులకు AI ట్రైనింగ్’ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న AI ఆధారిత టెక్నాలజీలను దృష్టిలో ఉంచుకొని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా, ఉద్యోగులు AI టూల్స్పై ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు హ్యాకథాన్లు, లైవ్ ప్రాజెక్ట్లు, సిమ్యులేషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Breaking News – Department of Medicine : వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం రేవంత్
TCS ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘5.93 లక్షల మంది ఉద్యోగులను’ కలిగి ఉంది. ఇంత పెద్ద workforceను AI రంగంలో శిక్షణ ఇవ్వడం ప్రపంచ ఐటీ రంగంలో ఒక విశేషమైన అడుగు అని నిపుణులు అంటున్నారు. AI ఆధారిత పరిజ్ఞానం ఇప్పుడు ప్రతి వ్యాపార విభాగంలో కీలకమవుతుండటంతో, ఈ తరహా ట్రైనింగ్ ఉద్యోగుల ఉత్పాదకతను, సాంకేతిక సృజనాత్మకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా AI స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాయి. అయితే TCS దాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడం ద్వారా, భవిష్యత్ ఐటీ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హారిక్ విన్ మాట్లాడుతూ, “ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సంస్థ తన ఉద్యోగులను AIలో నైపుణ్యం కలిగించకపోతే, భవిష్యత్ పోటీలో వెనుకబడే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న ఈ దశలో, AIను తమ రోజువారీ కార్యకలాపాల్లో అనుసంధానం చేయడం తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణతో ఉద్యోగులు తమ ప్రాజెక్టుల్లో మెషీన్ లెర్నింగ్, డేటా అనాలిటిక్స్, ఆటోమేషన్ వంటి అంశాలను సులభంగా వినియోగించగలుగుతారని తెలిపారు. దీని ఫలితంగా TCS కేవలం ఐటీ సేవలే కాకుండా, ‘AI ఆధారిత సొల్యూషన్లలో గ్లోబల్ లీడర్గా’ ఎదగబోతోందని నిపుణుల అంచనా.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/