ప్రస్తుతం మనం వాషింగ్ మెషీన్లతో బట్టలు ఉతికే ప్రక్రియను చూశాం. కానీ భవిష్యత్తులో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో “హ్యూమన్ వాషింగ్ మెషీన్లు” వచ్చిపడతాయట. దీనిలో మనుషులని ఉతికి ఆరేసే సాంకేతికత ఉంటుందని చెప్పబడుతోంది. ఒకసారి అలసిపోయిన వ్యక్తి, స్నానం చేయాలంటే అతను కేవలం 15 నిమిషాలు ఒక మెషీన్లో కూర్చొని, కొద్ది నిమిషాల్లో తలతలలాడే శరీరంతో బయటకు వస్తాడట ఈ వాషింగ్ మెషీన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉంటే, అది వ్యక్తి శరీరాన్ని, చర్మాన్ని పరిశీలించి, స్నానానికి సరిపోయే వాష్ అండ్ డ్రై ఆప్షన్లను నిర్ణయిస్తుంది.

జపాన్కు చెందిన సైన్స్ కో సంస్థ, ప్రజలకు స్నానాన్ని మరింత సౌకర్యవంతంగా అందించడానికి ఈ మెషీన్ను అభివృద్ధి చేసింది.ఈ టెక్నాలజీని ఒసాకా కన్సాయ్ ఎక్స్పోలో ప్రదర్శించారు, అక్కడ 1,000 మంది అతిథులు దీన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఈ ప్రదర్శన అనంతరం ఈ మెషీన్ను మాస్ ప్రొడక్షన్లో విడుదల చేయాలని సైన్స్ కో కంపెనీ చైర్మన్ ఆయోమా తెలిపారు.ఈ మెషీన్కు పోటీగా, మీరు ఎంటర్ అయిన వెంటనే, అది ఫైటర్ జెట్ కాక్పీట్ వంటి ప్లాస్టిక్ ప్యాడ్లో మిమ్మల్ని ఉంచుతుంది. ఆ తర్వాత, ఆ ప్యాడ్ సగం నీటితో నింపబడుతుంది. తరువాత, హైస్పీడ్ జెట్స్ వేగంగా నీటిని స్ప్రే చేస్తాయి, మీరు స్నానాన్ని ఆహ్లాదంగా అనుభవించడానికి ఈ మెషీన్ పనిచేస్తుంది.
AI వలన, ఇది వ్యక్తి శారీరక పరిస్థితిని తెలుసుకొని, అలా చర్యలు తీసుకుంటుంది.ఈ సాంకేతికత ఎంతో ఆధునికమైనదిగా అనిపించినా, అది పాత కాలపు ఒక ఆవిష్కరణ. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోజిషన్లో ప్రదర్శించిన మిషన్ ఆధారంగా ఈ కొత్త వర్షన్ తయారైంది. అయితే, కొత్త వెర్షన్లో ఎక్కువ మసాజ్ బాల్స్ అమర్చడం వంటి సాంకేతికత జోడించబడింది.ఈ మెషీన్ను జపాన్లోని ఒసాకా ఎక్స్పో 2025లో ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంకేతికత మన జీవితాన్ని మారుస్తూ, భవిష్యత్తులో మనం పనే వేయకుండా స్నానం చేయగలుగుతాము.