ఆంధ్రప్రదేశ్లో టీచర్ల వెబ్ కౌన్సెలింగ్ (Web Counseling for teachers) పై వివాదం మరింత ముదిరింది. టీచర్లు (Teachers ) డిమాండ్ చేస్తుండగా – కౌన్సెలింగ్ను మాన్యువల్ విధానంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి (జూన్ 9) నుంచి జిల్లా విద్యాధికారి (DEO) కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలు ప్రారంభం కానున్నాయి.
విద్యా శాఖ ప్రతిపాదనపై టీచర్ల వ్యతిరేకత
నిన్న విద్యాశాఖ ప్రతిపాదించిన విధంగా స్లాట్ల ప్రకారం ఒక్కో విడతలో 500 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. అయితే, ఈ వెబ్ ఆధారిత విధానాన్ని టీచర్లు ఖండించారు. “మాన్యువల్ కౌన్సెలింగ్ తప్ప దేన్నీ అంగీకరించం” అని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేశాయి. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా తాము అన్యాయానికి గురవుతామని వారు ఆరోపిస్తున్నారు.
మంగళగిరిలో విద్యాభవన్ ముట్టడి పిలుపు
ముదిరిన పరిస్థితుల మధ్య, రేపు (జూన్ 10) మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించేందుకు జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరుతున్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని నిలిపివేసి మాన్యువల్ విధానాన్ని వెంటనే అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం మరింత ఉధృతం కావచ్చు.
Read Also : ‘Kaleswaram’ Investigation : నేడు ‘కాళేశ్వరం’ విచారణకు హరీశ్ రావు