Teacher mlc nominations from today

నేటి నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు..

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 11న స్క్రూట్నీ, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్‌ నిర్వహించి మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 200 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో 24,905 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

image

వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్‌ విడుదల చేయగా నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నల్లగొండ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

మరోవైపు.. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నరేందర్‌రెడ్డిని, అంజిరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ బీసీ కార్డుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి, భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ఈ మేరకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌కు ప్రతిపాదించారని, ఆయన సోమవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే.. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రెబల్‌గా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related Posts
ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..
'Terror threat' to PM Modi's aircraft, Mumbai Police receives warning call, probe on

ముంబయి : ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్‌ Read more

ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్
Vallabhaneni Vamsi remanded until the 17th of this month

అమరావతి: గన్నరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్​చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్​జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ​ను Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh dies

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 నుంచి 1996 వరకు అప్పటి Read more

నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
Sankalp Kiron award to actor Sonu Sood

హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more