PM Modi celebrates Ram Navami in Rameswaram

PM Modi: రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి వేడుకలు..

PM Modi: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 06న ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇదే రోజు కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది.

Advertisements
రామేశ్వరంలో ప్రధాని మోడీ రామనవమి

కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 2024లో ‘‘భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన’’ అని దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది హైస్పీడ్ రైళ్లు, పెరిగిన ట్రాఫిక్‌కి అనుగుణంగా నిర్మించారు.

వివాదాల వేళ తమిళనాడుకు ప్రధాని

హిందీ వివాదం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)పై ఇటీవల కేంద్రం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందీని తమపై రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ని వ్యతిరేకిస్తూ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో భేటీ జరిగింది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గతాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
Police restrictions on New Year celebrations

హైదరాబాద్‌: న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి ఇప్పటి నుంచే హైదరాబాద్ ముస్తాబవుతోంది. వేడుకల కోసం సిద్ధమౌతోంది. ఇప్పటికే ఈ దిశగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఆఫర్లను Read more

Forbes Billionaire: విడుదలైన ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా..
విడుదలైన ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా..

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా-2025 విడుదలైంది. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. గ‌తేడాది బిలియనీర్ల సంఖ్యతో పోలిస్తే 247 మంది ఎక్కువ. ప్ర‌పంచ‌ Read more

Chhattisgarh:వేరు వేరు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh:వేరు వేరు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై మరోసారి కాల్పులూ౮ జరిపాయి.గురువారం (మార్చి 21, 2025) చోటుచేసుకున్న రెండు పెద్ద ఎదురుకాల్పుల ఘటనల్లో 30 మంది మావోయిస్టులు Read more

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: NDA సిఎం అభ్యర్థిగా నితీష్ కుమార్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: NDA సిఎం అభ్యర్థిగా నితీష్ కుమార్

బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి శుక్రవారం ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ కొనసాగుతారని స్పష్టంగా ప్రకటించారు. అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×