Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

Ashwini Vaishnaw : 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు.గేమింగ్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Advertisements
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం
Ashwini Vaishnaw 1410 గేమింగ్ సైట్లను నిషేధించిన కేంద్రం

తమిళనాడు ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం – కేంద్రంపై ప్రశ్నలు

డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు.తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, అయితే కేంద్రం మాత్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా? అని ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలకు స్పందించిన అశ్వినీ వైష్ణవ్, “కేంద్రం నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం లేదు.నైతికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు.రాజ్యాంగం రాష్ట్రాలకు చట్టాలు రూపొందించుకునే అధికారం ఇచ్చింది.అందుకే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1410 గేమింగ్ వెబ్‌సైట్లను నిషేధించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.భవిష్యత్తులోనూ ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్రాల పరిధిలోనే గేమింగ్, బెట్టింగ్ చట్టాలు

ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయాన్ని చట్టపరంగా నియంత్రించాలంటూ సూచించారు.కేంద్రం చేసిన తాజా ప్రకటనతో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గేమింగ్ నిషేధానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి.మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేయనున్నాయా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

Related Posts
IPL2025: చెన్నైని ఓడించిన పంజాబ్‌
IPL2025: చెన్నైని ఓడించిన పంజాబ్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది.మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత Read more

ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే : హరీశ్ రావు
Government is fully responsible for this incident: Harish Rao

కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపాటు హైదరాబాద్‌: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక Read more

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఢిల్లీ కి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే Read more

రాహుల్​గాంధీ కులమేంటో చెప్పండి : రఘునందన్
Raghunandan Rao Sensational Comments On Rahul Gandhi

హైదరాబాద్‌: ప్రధాని మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు స్పందించారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్​ బీసీ అని సీఎం వ్యాఖ్యానించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×