हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్

Sudheer
ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబు సీరియస్

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇటీవల ఆయన ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనను టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణించడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి చెడ్డపేరు కలిగించే అలాంటి చర్యలను సహించబోమని చంద్రబాబు ఇప్పటికే స్పష్టంచేశారు.

ఇటీవల జరిగిన ఘటనపై క్రమశిక్షణా కమిటీ నివేదిక అందించినట్లు తెలుస్తోంది. పార్టీ నియమాలను ఉల్లంఘించినట్లు భావిస్తున్న కొలికపూడికి సోమవారం కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఆయన తీరు గతంలో కూడా వివాదాస్పదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పార్టీ పరువు మసకబారిందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొలికపూడి వ్యవహార శైలిపై ఇప్పటికే పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరు నియమాలను అతిక్రమిస్తుందనే ఆరోపణలతో పాటు పార్టీకి అనుకూలంగా పనిచేయడం లేదన్న విమర్శలు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వివాదం మీడియా హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టనుంది. కొలికపూడి నుంచి వివరణ కోరిన తర్వాత తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీలో క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలని, అలాంటి చట్టవ్యతిరేక చర్యలను సహించేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇతర నేతలకు కూడా వార్నింగ్‌గా మారనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870