ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా అప్పగింత ప్రక్రియపై రాజకీయ విభేదాలు మళ్లీ ముదిరాయి. ఈ విషయాన్ని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలకంగా వ్యాఖ్యానించారు తహవ్వూర్ రాణా అప్పగింతపై కేంద్రం అంతగా చేయలేదని స్పష్టం చేశారు. ఎన్డీయే ఇప్పుడు తీసుకుంటున్న కీర్తి అసలుగా యూపీఏ పాలనలో వేసిన బీజాల ఫలమేనని తేల్చేశారు. అప్పట్లో ఉగ్రవాదంపై సాగిన వ్యూహాత్మక చర్చలే ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.తన ప్రభుత్వ హయాంలోనే అమెరికాతో సంప్రదింపులు జరిగాయని చెప్పారు దాదాపు పదేళ్ల కృషితో ఈ ఫలితం వచ్చిందని వివరించారు.

మోదీ ఈ ప్రక్రియను ప్రారంభించలేదని, కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వం దీన్ని తమ విజయం లా చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.తహవ్వూర్ రాణాపై 2011లో అమెరికా కోర్టు కేసు నుంచి వదిలినప్పుడు, కాంగ్రెస్ బహిరంగంగా నిరసన తెలిపినట్లు గుర్తు చేశారు.ఆ తర్వాత అతడు మరిన్ని ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నందుకు అమెరికా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించిందని తెలిపారు.అంతేకాక, అప్పగింత కోసం భారత్ తరపున భారీగా దౌత్య ఒత్తిడి చేసిన విషయాన్ని కూడా చిదంబరం వెల్లడించారు. యూపీఏ హయాంలో విదేశాంగ శాఖ దాని కోసం కృషి చేసిందని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాన్ని తమ కృషిగా చూపడం సరైంది కాదన్నారు.తహవ్వూర్ రాణా అప్పగింత భారత ఉగ్రవాద విభాగానికి పెద్ద విజయంగా కనిపిస్తున్నా, రాజకీయంగా మాత్రం ఎవరి కృషికి నిజమైన క్రెడిట్ వెళ్లాలి అనే చర్చ ముదిరింది. కాంగ్రెస్ మాత్రం స్పష్టంగా చెబుతోంది – “ఇది మేము మొదలెట్టిన ప్రయాణం… మేమే గమ్యం వైపు నడిపించాం!”