Supriya Sule impatience with Air India

Supriya Sule: విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలి: సుప్రియా సూలే

Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్‌ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా విమానాలు నిరంతరం ఆలస్యం అవుతున్నాయి. మేము ప్రీమియం ఛార్జీలు చెల్లిస్తాం. అయినప్పటికీ విమానాలు సమయానికి చేరుకోవు. దీని కారణంగా పిల్లలు, వృద్ధులతో సహా అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు.

విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు

ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు

నేను ఎయిర్ఇండియా సంస్థకు చెందిన విమానంలో ప్రయాణించా. దీనికోసం గంట 19 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి ఆలస్యాలు ఆమోదయోగ్యం కావు. విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ని ఈసందర్భంగా కోరుతున్నా. ఇలాంటి జాప్యాలు పునరావృతం కాకుండా ఆయా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలి అని ఆమె రాసుకొచ్చారు.

తగు జాగ్రత్తలు తీసుకుంటామని

మరోవైపు ఈ పోస్టు పై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. తమ చేతుల్లో లేని పలు సమస్యల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపింది. మీరు ప్రయాణించే విమానానికి అలాంటి సమస్యే ఎదురైనట్లు వెల్లడించింది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా పేర్కొంది.

Related Posts
మరణం నుంచి తృటిలో తప్పించుకున్నాను: షేక్‌ హసీనా
sheikh hasina

కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, మేము మరణం నుండి తప్పించుకున్నాము అని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత తనపై, Read more

Karnataka : హనీ ట్రాప్‌ వ్యవహారం..రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ
Karnataka Assembly becomes a battlefield over honey trap issue

Karnataka : కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్‌ వ్యవహారం కుదిపేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు కర్ణాటక Read more

డీల్ కుదిరినట్టేనా? జెలెన్‌స్కీ నుంచి ట్రంప్‌కు లేఖ
జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్, కీలక చర్చలు

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నుంచి తనకు ముఖ్యమైన సందేశం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. Read more

ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భేటీ
Delhi CM Rekha Gupta meet Prime Minister Modi

రేఖా గుప్తాకు ప్రధాని మోడీ పలు సలహాలు, సూచనలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *