हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Supreme Court: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Sharanya
Supreme Court: ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెల్లడించింది. స్పీకర్ జాప్యం, హైకోర్టు ఆదేశాలు, చివరకు సర్వోన్నత న్యాయస్థాన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

స్పీకర్‌కు మూడు నెలల గడువు

సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం జులై 31న స్పష్టమైన తీర్పును వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మూడు నెలల గడువును విధించింది.

హైకోర్టు తీర్పుపై ముద్ర తీసిన సుప్రీం

ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. “న్యాయస్థానమే అనర్హతను నిర్ణయించాలి” అనే అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. వ్యవస్థల మధ్య బాధ్యతలను స్పష్టంగా గుర్తు చేస్తూ, “ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్” (Operation success.. Patient dead) అన్న వాక్యాన్ని ఉదాహరణగా పేర్కొన్నది.

కేసు నేపథ్యం – పార్టీ మారిన ఎమ్మెల్యేలు

ఈ వివాదానికి నేపథ్యం ఆసక్తికరంగా మారింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడం వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు వినతిపత్రాలు ఇచ్చింది. అయితే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు..

హైకోర్టు తన తీర్పులో స్పీకర్‌ను నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించగా, స్పీకర్ తమపై ఆదేశాలివ్వడానికి హైకోర్టుకు అధికారం లేదని అభిప్రాయపడ్డారు. దాంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తాము స్వయంగా వేటు వెయ్యలేమన్న సుప్రీంకోర్టు.. దీనిపై మూడు నెలల్లో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telangana High Court: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870