హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూముల వివాదం తాజాగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ భూమి వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) ఆవరణలో ప్రభుత్వమే చెట్లను నరికివేస్తోందంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యవసర విచారణ జరిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించి, హైకోర్టు రిజిస్ట్రార్ను సాయంత్రం 3.30 లోపు స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు కఠిన ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో 400 ఎకరాల భూభాగంలో చెట్లను తొలగిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్ను రంగంలోకి దించి, మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. తుది ఆదేశాలు వచ్చే వరకు చెట్లు నరికివేత జరగకూడదని స్పష్టం చేసింది. ఈ భూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. అయితే పిటిషన్ పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యాహ్నం 3.30లోగా కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, హైకోర్టులో విచారణ కొనసాగుతుందని తెలియజేస్తూనే, తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలి భూములు గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారాయి. ఈ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ప్రక్రియలో కొన్ని భూముల వివరాలు బయటకొచ్చాయి. ప్రభుత్వ అధికారం ఉన్న ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, భూసేకరణలకు సంబంధించిన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి.
భూ వివాదంపై దేశవ్యాప్త దృష్టి
సుప్రీంకోర్టు మధ్యంతర నివేదిక కోరింది. చెట్ల నరికివేత తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ సీఎస్కు ఆదేశాలు, హైకోర్టు విచారణ కొనసాగుతున్నా, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని స్పష్టం, కంచె గచ్చిబౌలి భూ వివాదంపై ప్రభుత్వం, స్థానికులు భిన్న అభిప్రాయాలు హైదరాబాద్లో ఈ భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూముల వివాదంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, ఈ వ్యవహారం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడం ఈ వ్యవహారానికి ప్రాముఖ్యతను పెంచింది.