हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Bihar: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్

Vanipushpa
Bihar: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్

దేశంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను ఎలక్టోరల్ రోల్స్ నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల గుర్తింపు వివరాలను ఆగస్టు 19లోగా తమకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓటర్ల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత లేదని, పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం
బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఓటర్ లిస్ట్(Voter List) నుంచి పెద్ద సంఖ్యలో పేర్లను తొలగించడంపై ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికల సంఘం ఏకపక్షంగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఓటర్లను తొలగించిందని ఆరోపించాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలను, వారి తొలగింపునకు గల కారణాలను స్పష్టంగా వివరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ని కోరింది.

Bihar: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్
Bihar: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్

ఈసీ(EC) కి ఇప్పటికే న్యాయస్థానం గడువు ఇచ్చింది
న్యాయస్థానం ఈ విషయంలో ఈసీ(EC) కి ఇప్పటికే చాలా గడువు ఇచ్చిందని, అయితే ఈసీ నుండి సరైన స్పందన రాలేదని పేర్కొంది. ఈసీ తమ వాదనలను సకాలంలో సమర్పించడంలో విఫలమైతే, కోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించవలసి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది. ఈ లోగా తొలగించిన 65 లక్షల ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలను తమకు అందించాలని ఈసీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు దేశంలో ఎన్నికల పారదర్శకతపై ఆందోళనలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి. ఓటర్ల తొలగింపు ప్రక్రియ సక్రమంగా లేదన్న ఆరోపణలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కోర్టు నొక్కి చెప్పింది. ఈ తీర్పుతో ఎన్నికల సంఘం ముందు ఇప్పుడు ఓటర్ల తొలగింపు ప్రక్రియపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన పెద్ద సవాలు నిలిచింది.

భారత ప్రధాన ఎన్నికల కమిషనరు ఎంపిక 

అనే పదవి స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం కలిగిన భారత ఎన్నికల కమిషన్ (సిఇసి)కి నాయకత్వం వహించే ప్రధాన ఎన్నికల కమిషనరు (సిఇసి). భారత ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dharmasthala-temple-key-evidence-in-the-excavations-of-dharmasthala/crime/525812/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870