భారత్, పాకిస్థాన్లు (India-pakistan) మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్వాగతించింది. జ్ఞానం, వివేకం, రాజనీతిజ్ఞతతో సరైన మార్గాన్ని ఎంచుకున్న ఇరుదేశాల నాయకత్వాన్ని ప్రశంసించింది. భారత్, పాక్ల (India-pakistan) మధ్య సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించింది. దాయాదులైన భారత్-పాక్లు ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కోరుకుంటున్నారు. భవిష్యత్లోనూ ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణలను నివారించడానికి, చర్చలను మరింత సులభతరం చేయడానికి అమెరికా మద్దతు అందిస్తూనే ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

పాక్ దిగొచ్చింది: కాల్పుల విరమణ ఒప్పందం
ఏప్రిల్ 22న పాక్కు చెందిన ఉగ్రవాదాలు జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో మారణహోమం సృష్టించారు. హిందూ పర్యాటకులే లక్ష్యంగా దాడులు చేసి 26 మందిని బలిగొన్నారు. దీనితో భారత్ మే 7 ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనితో భారత్ ఎఫ్-16 సహా 3 పాక్ ఫైటర్ జెట్లను, 50 డ్రోన్లను కూల్చేసింది. అంతేకాదు పాకిస్థాన్లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ మిలటరీ క్యాంప్లను దెబ్బతీసింది.
భారత వైమానిక దళం స్పందన
“ఉగ్రవాదుల శిబిరాలను నిర్మూలించాలనే భారత్ లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నకు ‘అవును’ అని, ఈ ఫలితాలను ప్రపంచం మొత్తం చూడగలదు” అని ఎయిర్ మార్షల్ భారతి అన్నారు. ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్ సందర్భంగా, డైరెక్టర్ జనరల్ నావల్ ఆపరేషన్స్, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాకిస్థాన్కు స్పష్టమైన హెచ్చరిక చేశారు. “ఈసారి పాకిస్థాన్ ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేస్తే, మనం ఏం చేస్తామో పాకిస్థాన్కు తెలుసు. ధట్స్ ఆల్” అని అన్నారు.
Read Also: India-pak : భారత్-పాక్ చర్చలు షురూ