Sunita Williams arrival delayed further

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం

న్యూఢిల్లీ: దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకువచ్చేందు చేపట్టిన నాసా, స్పేస్ ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ మరోసారి వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధం అయ్యింది. అయితే అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమ గాముల రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisements
image

స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు

జూన్ 5, 2024న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారు ఐఎస్ఎస్‌కు చేరిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు వారం రోజులకే భూమిని చేరాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరింది. సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్‌లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఐఎస్ కు పంపించాల్సి ఉంటుంది.

మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు

ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు తెలిపారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని..నౌకలో కొత్తగా ఐఎస్ఎస్ లోకి వచ్చ వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని తెలిపారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు చేరుకుంటామని తెలిపారు. క్రూ-10 స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఇద్దరు సిబ్బంది కొన్ని రోజుల పాటు ISSలో కలిసి ఉంటారు. తరువాత, విలియమ్స్, విల్మోర్ నాసా వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో తిరుగు ప్రయాణం చేస్తారు. అయితే, ఫ్లోరిడా తీరంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల వారు తిరిగి రావడం మరింత ఆలస్యం కావచ్చు.

Related Posts
Paritala Sunitha: పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు
పరిటాల హత్యపై సునిత జగన్ పై సంచలన ఆరోపణలు

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని ఆమె Read more

ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్..
Isuzu Motors India adds 4 new touch points..Enters Bihar and expands footprint in India

చెన్నై: ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ Read more

మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలో తెలుసా..?
RBI Bank Rpao

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 25 బేసిస్ పాయింట్లు (bps) వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించాల్సిన Read more

ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్
jagan fire cbn

తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం Read more

×