AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చెశారు. సుచిత్ర ఎల్లా కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చేనేత, హస్త కళల అభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తారు.

మరోవైపు డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్రెడ్డిని ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ హబ్ గౌరవ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. అలాగే కేపీసీ గాంధీని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమించారు. శ్రీధర పనిక్కర్ సోమనాథ్ను స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురు సలహాదారులను రెండేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించింది. వీరందరికీ కేబినెట్ ర్యాంకు ఉంటుంది. ప్రభుత్వం వీరి సలహాలను చేనేత, హస్తకళలు, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది.
ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ హబ్ గౌరవ సలహాదారుగా నియమితులైన జి.సతీష్రెడ్డి రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ఆయన ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటుకు సతీష్ రెడ్డి సలహాలు ఇస్తారు. AI, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్టెక్లో కూడా ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వానికి సతీష్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు కూడా ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కేటాయించింది.
ఇక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమితులైన కేపీసీ గాంధీకి కూడా కేబినెట్ ర్యాంక్ హోదాలో రెండేళ్ల పాటు విధులు నిర్వహించనున్నారు. ఇక శ్రీధర పనిక్కర్ సోమనాథ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ఆయన ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నారు. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సోమనాథ్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నారు.