కొన్నిసార్లు పరిస్థితులు మన సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. మంచి భవిష్యత్తు కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చదువుకోవాలనే సంకల్పంతో ఉన్న కొందరు విద్యార్థులు.. నదీలోయను దాటడానికి సైతం వెనుకాడట్లేదు. ప్రతిరోజు లోయను దాటుతూ స్కూల్కి వెళ్లి వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా రోజూ ట్రాలీపై ప్రయాణిస్తూ చదువును కొనసాగిస్తున్నారు. ఎలాంటి భయమూ లేకుండా, సునాయాసంగా వారు నదిని దాటడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్ విద్యార్థులకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్లోని మున్సియారి గ్రామంలోని స్కూల్ గర్ల్స్.. స్కూల్కి వెళ్లడానికి ఎదురవుతున్న సవాళ్లను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇన్స్టాగ్రాంలో ‘త్రిభ్చౌహాన్’ అనే హ్యాండిల నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. నదీలోయను దాటడానికి ట్రాలీ లాగుతున్న విద్యార్థులను ఓ వ్యక్తి పలకరించాడు. అభివృద్ధి అంటే ఇలాగేనా ఉండేది? అనే మాటలతో వీడియో ప్రారంభం అవుతోంది. ‘2025లో కూడా మన వ్యవస్థ ఎలా ఉందో మీరే చూడండి. భేటీ బచావో, భేటీ పడావో వంటి పథకాలు ఎన్ని వచ్చినా కూడా బాలికల పరిస్థితి ఏం మారడం లేదు’ అంటూ చెప్పుకొచ్చి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ వద్ద భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి Read more
మహాకుంభ మేళా జరుగుతున్న వేళ గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ప్రారంభం అవుతున్నాయి. కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి Read more
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా Read more
ఇటీవల కాలంలో మావోలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో వరుసపెట్టి మావోలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఈరోజు శనివారం బస్తర్ రీజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ Read more