అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో విద్యార్థులకు మేలు

విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు. రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను నేర్పించనున్నారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) స్కిల్స్ ను పెంపొందించడం ఈ ల్యాబ్య్ ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ లో డీఐవై కిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT), 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, కోడింగ్ స్కిల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అకాడెమీ, ఇండస్ట్రీ నుంచి నిపుణులతో మెంటార్ షిప్ ప్రోగ్రాం, సృజనాత్మకతలో సవాళ్లు, పోటీతత్వం.. తదితర అన్ని విభాగాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. భారత్ స్టార్టప్ సిస్టమ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చిన్నవయసునుంచే విద్యార్థుల్లో స్టార్ట్ అప్ వ్యవస్థలపై అవగాహన కల్పించడం. పాఠశాల నుంచే విద్యార్థులకు టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

Related Posts
బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా
rachel gupta

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మకమైన 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024' కిరీటాన్ని గెలుచుకొని భారత్‌కి మరొక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఈ పోటీలు థాయిలాండ్‌లోని Read more

మళ్లీ ఇస్రో ‘స్పేడెక్స్‌’వాయిదా..
ISRO Postpones Space Docking Experiment Again

బెంగళూరు : ఇస్రో చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌(స్పేడెక్స్‌)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం(డాకింగ్‌) చేయాలని ఇస్రో భావించింది. ఇందుకోసం రెండు ఉపగ్రహాలను Read more

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు
సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను Read more

Jio News: అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో
అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో

దేశంలోని మీడియా రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అన్ లిమిటెడ్ ఆఫర్‌తో ప్రజల ముందుకు తిరిగి వచ్చేస్తోంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ మెుదలు Read more