Strict action will be taken against those involved in betting.. AP Police

AP Police Department : బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు : ఏపీ పోలీస్ శాఖ

AP Police : ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో క్రికెట్ బెట్టింగ్స్ జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు విశాఖ లోనూ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రత్యక్షంగా కొన్ని చోట్ల బెట్టింగ్స్ జరుగుతుంటే ఆన్‌లైన్ ద్వారా కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో డబ్బులు పోగొట్టుకుని బాధితులు రోడ్డు పాలవుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ కట్టిన కొందరు నష్టాలు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కలకలం రేపాయి. దీంతో బెట్టింగ్స్ నిర్వహణపై రెండు రాష్ట్రాల పోలీసు శాఖలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాయి.

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

అయితే ఐపీఎల్ బెట్టింగులను కట్టడి చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారింది. ఈ మేరకు నిఘాను పెంచింది. బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులకు దిగుతున్నారు. నిందితులతో పాటు నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిందతులను జైలుకు పంపుతుననారు. మరోవైపు బెట్టింగ్ నిర్వాహకులపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. రంగంలోకి డైరెక్ట్‌గా ఏపీ డీజీపీ మహేశ్ కుమార్ గుప్తా దిగారు. బెట్టింగ్‌ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగుల్లో పాల్గొని యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నిర్వాహకుల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని డీజీపీ గుప్తా హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

Related Posts
బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
bandivsponnam

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు Read more

పోసాని గోరంట్లపై చర్యలు ఉంటాయి :మంత్రి అనిత
చట్టబద్ధంగా చర్యలు కొనసాగుతాయి: వంగలపూడి అనిత

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవల పోసాని కృష్ణ మురళీ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఏపీ Read more

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు

ఇన్ఫోసిస్, ఇప్పటికే హైదరాబాద్లో 35,000 మంది ఉద్యోగులతో కొనసాగుతూ, ఇప్పుడు 17,000 కొత్త ఉద్యోగాల సృష్టికి సిద్ధమవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు హైదరాబాద్ లోని పోచారం ఐటీ Read more

భారతదేశం GSAT-N2 కోసం స్పేస్‌ఎక్స్ ఎంపిక..
gsatn2

భారతదేశం యొక్క GSAT-N2 ఉపగ్రహం, కా-బ్యాండ్ సాంకేతికతతో రూపొందించబడిన ఒక హై-త్రోపుట్ ఉపగ్రహం, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిజిటల్ వీడియో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *