Strict action will be taken against those involved in betting.. AP Police

AP Police Department : బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు : ఏపీ పోలీస్ శాఖ

AP Police : ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో క్రికెట్ బెట్టింగ్స్ జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు విశాఖ లోనూ జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈక్రమంలోనే ప్రత్యక్షంగా కొన్ని చోట్ల బెట్టింగ్స్ జరుగుతుంటే ఆన్‌లైన్ ద్వారా కోట్లలో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దీంతో డబ్బులు పోగొట్టుకుని బాధితులు రోడ్డు పాలవుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్ కట్టిన కొందరు నష్టాలు పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కలకలం రేపాయి. దీంతో బెట్టింగ్స్ నిర్వహణపై రెండు రాష్ట్రాల పోలీసు శాఖలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఐపీఎల్‌లో బెట్టింగులు నిర్వహించొద్దని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించాయి.

Advertisements
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

అయితే ఐపీఎల్ బెట్టింగులను కట్టడి చేసేందుకు ఏపీ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్ కార్యకలాపాలపై పూర్తిగా దృష్టి సారింది. ఈ మేరకు నిఘాను పెంచింది. బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం వస్తే చాలు వెంటనే దాడులకు దిగుతున్నారు. నిందితులతో పాటు నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిందతులను జైలుకు పంపుతుననారు. మరోవైపు బెట్టింగ్ నిర్వాహకులపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. రంగంలోకి డైరెక్ట్‌గా ఏపీ డీజీపీ మహేశ్ కుమార్ గుప్తా దిగారు. బెట్టింగ్‌ నిర్వహించినా, పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగుల్లో పాల్గొని యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నిర్వాహకుల్లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని డీజీపీ గుప్తా హెచ్చరించారు. ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు.

Related Posts
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Disqualification case of Telangana MLAs.. KTR to Supreme

హైదరాబాద్‌: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం Read more

ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం
CBN delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఢిల్లీ చేరుకుని, తెలుగు వాసులు ఎక్కువగా Read more

TGSRTC : హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్
TGSRTC: త్వరలో తెలంగాణకు కొత్త ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి రద్దీగల ప్రధాన రైల్వే స్టేషన్లపై భారం తగ్గించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునిక హంగులతో దక్షిణ మధ్య రైల్వే Read more

నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల
Telangana Group 1 results released today

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. నేడు గ్రూప్‌-1,ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ తెలిపింది.మొత్తం 563 పోస్టులకు‌గానూ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×