हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి – డైరెక్టర్ పూరీ

Sudheer
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి – డైరెక్టర్ పూరీ

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా తన పాడ్కాస్ట్‌లో సోషల్ మీడియా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా నెగటివిటీకి కేంద్రంగా మారిందని, ఇది వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు ఏదైనా పోస్టు పెట్టినప్పుడు, అది నెగటివ్ కామెంట్లను ఆకర్షించే పరిస్థితి నెలకొనిందని పూరీ అభిప్రాయపడ్డారు.

“మన దేశంలో పనీపాటా లేని వారి సంఖ్య కోట్లల్లో ఉంది. వారి దృష్టి నిత్యం సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలపై ఉంటుంది. మీరు ఏదైనా పంచుకున్నా, అది ఆత్మీయ సంబంధాల మీద ప్రభావం చూపుతుంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడం మంచిది,” అని పూరీ చెప్పుకొచ్చారు.

ప్రత్యేకంగా అమ్మాయిలను ఉద్దేశిస్తూ పూరీ కొన్ని సూచనలు చేశారు. “మీ భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు, మిగిలిన ప్రపంచానికి మీ అన్యోన్యతను చూపించాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అనవసర సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ బంధాలు, అనుబంధాలను నెగటివిటీ నుంచి కాపాడుకోవాలి,” అని పూరీ పేర్కొన్నారు. “జీవితాన్ని నిజ జీవితంలో ఆనందించండి. సోషల్ మీడియా మీ జీవితంపై శాసించనివ్వకండి” అని పూరీ తన పాడ్కాస్ట్‌లో తేల్చి చెప్పారు.

పూరీ చెప్పిన అంశాలు యువతకు, సోషల్ మీడియా వినియోగదారులకు ఆలోచనలకు దారి తీసే విధంగా ఉన్నాయి. సోషల్ మీడియా సాంకేతిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870