ఉత్తరాఖండ్లోని పవిత్ర నగరం హరిద్వార్లో ఘోర విషాదం (A terrible tragedy in Haridwar) చోటు చేసుకుంది. మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు (Eight devotees lost their lives in the stampede). మరో 30 మంది గాయపడ్డారు.ప్రధాన ఆలయానికి వెళ్లే మెట్లపై అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. విద్యుత్ షాక్ పుకార్లు జనంలో భయాందోళనలకు దారితీశాయి. దీంతో భక్తులు పరుగులు తీయగా, పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు ఇదే కారణంగా తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు.

అధికారుల స్పందన
గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వివరాలు వెల్లడించారు. ఘటనకు ముందు ఆలయం వద్ద భారీగా భక్తులు గుమికూడారని చెప్పారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపారు.మృతుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరుష్ (12), వివేక్ (18), వకీల్, శాంతి, ఉత్తరాఖండ్కు చెందిన విపిన్ సైని (18), బీహార్కు చెందిన షకల్ దేవ్ (18) ఉన్నారు. మొత్తం 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. భక్తుల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధితుల కోసం పోలీసులు హెల్ప్లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.ఈ ఘటనతో హరిద్వార్లో విషాద వాతావరణం నెలకొంది. భక్తులు, స్థానికులు ఇంకా షాక్లో ఉన్నారు. అధికారులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకుంటున్నారు.
Read Also : Encounter : ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… నలుగురు మృతి