హైదరాబాద్: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ – గోవా, చీఫ్ అడ్వైజర్గావి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. దీంతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో అరుదైన గౌరవం దక్కింది.

తెలంగాణలో మాదిరిగా గోవాలో కూ డా ఓబీసీల సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని వివిధ సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. అనంతరం శ్రీ నివాస్గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్ర భుత్వం జనగణనతోపాటు కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ తరహా గోవాలో మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ సూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీ య ఓబీసీ మహాసంఘ్ గోవా రాష్ట్ర అ ధ్యక్షుడు మధు అనంత్నాయక్, వైస్ ప్రెసిడెంట్ నోను నాయక్, ఫిషరీస్ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభ అమోడర్, నాభిక్ సమాజ్ సెక్రటరీ లాడ్సులాకర్ పాల్గొన్నారు.