హైదరాబాద్: రాష్ట్రంలోని గౌడ్లు, గీతకార్మికుల జీవనాధారమైన కల్లును నిషేదిస్తే (If toad is banned) సహించేది లేదని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీకి తాము వ్యతిరేకమని, అయితే అదే సాకుతో కల్లు వృత్తిని నిషేదించాలని చూస్తున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

కల్లులో కల్తీకి ఏ ఫార్మా కంపెనీ నుండి ఆమందు సరఫరా అవుతుందో, ఆ కంపెనీలను కూడా నిషేధించి, వాటి పై చట్ట పరమైన చర్యలు (Legal proceedings) తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గౌడ కులస్తులకు 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిందని అలాగే పది లక్షల ఎక్స్రేషియా, డ్రిప్ పద్దతిలో చెట్లను పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ వాటిని విస్మరించిందన్నారు. అలాగే అనేక గీత సొసైటీల నుండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, దమ్ముంటే దానిపై విచారణ చేసి, అధి కారులు, అనధికారులు ఎవరెవరు ఎంత మామూళ్లు తీసుకుంటు న్నారో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఆర్ ఆర్ వద్ద కల్లు దుకాణాలు ఎత్తివేయాలని చూస్తున్నారని, డిస్టిలరీ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు .
Read hindi news: hindi.vaartha.com