Sri Sitaram wedding in Vontimitta.. 70 thousand Tirumala laddus

Vontimitta : ఒంటిమిట్ట శ్రీ‌సీతారాముల‌ కళ్యాణం.. 70వేల తిరుమ‌ల ల‌డ్డూలు

Vontimitta : శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisements
ఒంటిమిట్ట శ్రీ‌సీతారాముల‌ కళ్యాణం 70వేల

దాదాపు 300 మంది శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలు

భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్‌-2లో బుధవారం శ్రీవారి సేవకుల సాయంతో తిరుమల లడ్డూలను ప్యాకింగ్‌ చేయించింది. డిప్యూటీ ఈవో (జనరల్‌) శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. కాగా, ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.

టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం

ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగిన సమీక్షాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన అయ్యాక దేవాదాయ శాఖ నుంచి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీటీడీలో విలీనం చేశారని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు.

Related Posts
Trump: భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌
Trump: భారత్‌ – పాక్‌ మధ్య సీజ్‌ఫైర్‌.. మరోసారి స్పందించిన ట్రంప్‌

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా మధ్యవర్తిత్వంతో తగ్గాయి. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్‌, పాక్‌ మధ్య ఇప్పుడు సీజ్‌ఫైర్‌ ఉంది. Read more

తెలంగాణ పాఠశాలల్లో తెలుగుని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు..!
Government orders making Telugu compulsory in Telangana schools.

స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థులకు తెలుగు భాషను Read more

కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం..
CM Revanth Reddy introduced the caste enumeration survey report

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం Read more

Macherla: మాచర్ల మండలం పొదల్లో లభ్యమైన వీర భద్రుడి శిల్పం
Macherla: మాచర్ల మండలం పొదల్లో లభ్యమైన వీర భద్రుడి శిల్పం

భైరవునిపాడు గ్రామంలో అరుదైన పురాతన వీరభద్రుని విగ్రహం వెలుగు పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని భైరవునిపాడు గ్రామంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన పురాతన విగ్రహం వెలుగు చూసింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×