టీమిండియా మాజీ వికెట్కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) తన దేశీయ కెరీర్లో అద్భుత ఘనత సాధించాడు. 2018లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(Cricket Association of Bengal) (CAB) నిర్వహించిన టి20 టోర్నమెంట్లో మోహన్ బగాన్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సాహా, కేవలం 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో అతడు 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదుతూ మొత్తం 102 పరుగులు సాధించాడు.
Read also: Mirage: సోనీ లైవ్లో ‘మిరాజ్ మూవీ రివ్యూ

ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. సాహా సెంచరీ సహాయంతో మోహన్ బగాన్ జట్టు 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే ఛేదించి, 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీమిండియా కెరీర్లో సాహా ప్రయాణం
2010లో భారత జట్టులోకి అడుగుపెట్టిన వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha), మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 1353 పరుగులు సాధించాడు. వన్డేల్లో మాత్రం అతనికి అదృష్టం కలిసిరాలేదు — 9 మ్యాచ్ల్లో కేవలం 41 పరుగులే చేశాడు. 2014 తర్వాత వన్డే జట్టులో అవకాశం రాకపోవడంతో, చివరికి 2021 తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. 2025లో సాహా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి, ఇప్పుడు బెంగాల్ అండర్-23 జట్టు కోచ్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
సాహా పేరు రికార్డుల్లో శాశ్వతం
వృద్ధిమాన్ సాహా చేసిన ఈ 20 బంతుల సెంచరీ ఇప్పటికీ భారత దేశీయ క్రికెట్లో వేగవంతమైన సెంచరీగా గుర్తించబడుతోంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో కాకపోయినా, దేశీయ క్రికెట్లో ఇది విస్మయకర ఘనతగా నిలిచిపోయింది.
వృద్ధిమాన్ సాహా ఎంత బంతుల్లో సెంచరీ సాధించాడు?
కేవలం 20 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఈ రికార్డు ఏ మ్యాచ్లో జరిగింది?
2018లో మోహన్ బగాన్ vs బెంగాల్ నాగ్పూర్ రైల్వేస్ మ్యాచ్లో.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :