వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లీల శాలరీలను BCCI తగ్గించే అవకాశముంది. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటనకు సమయం దగ్గరపడుతుండగా, ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ వేతనాల్లో కోతను ఎదుర్కోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న బోర్డు వార్షిక కౌన్సిల్ భేటీలో ఇద్దర్నీ A+ కేటగిరీ నుంచి Aకు మారుస్తారని సమాచారం.
Read Also: Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?
ప్రస్తుతం A+ గ్రేడ్లో ఉన్న ఈ ఇద్దరు సీనియర్లు.. కొన్ని ఫార్మాట్లలో అంతగా ఆడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.బీసీసీఐ BCCI ఏటా ఆటగాళ్లతో నాలుగు కేటగిరీల్లో (గ్రేడ్ A+, A, B, C) కాంట్రాక్టులు కుదుర్చుకుంటుంది. ఈ గ్రేడ్ను బట్టి ఆటగాళ్లకు వార్షిక రిటైనర్షిప్ ఫీజు లభిస్తుంది. ఇది మ్యాచ్ ఫీజులకు అదనం. గత ఏప్రిల్ 2025లో చివరిసారిగా ఈ కాంట్రాక్టులను ప్రకటించారు. ఆటగాళ్ల ప్రదర్శన, అన్ని ఫార్మాట్లలో వారి భాగస్వామ్యం,
A+ గ్రేడ్ నుంచి తప్పించి, మరో గ్రేడ్కు పరిమితం

ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగా ఈ గ్రేడులను నిర్ణయిస్తారు.అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే వారికి, జట్టులో కీలకమైన ఆటగాళ్లకు మాత్రమే A+ కేటగిరీని కేటాయిస్తారు.ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ టెస్టులు, టీ20లకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని A+ గ్రేడ్ నుంచి తప్పించి, మరో గ్రేడ్కు పరిమితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ Aనుంచి A+కు ప్రమోట్ కానున్నారు. అంపైర్స్, రిఫరీల రెమ్యునరేషన్ అంశాలపైనా ఇందులో చర్చ జరగనుంది. ప్లేయర్లకు A+, A, B, C కేటగిరీలుగా బోర్డు శాలరీలు ఇస్తోంది. A+: ₹7కోట్లు, A: ₹5కోట్లు, B: ₹3కోట్లు, C: ₹1కోటి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: