వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (John Campbell) తన టెస్టు కెరీర్లో ఒక మైలురాయిని నమోదు చేశాడు. భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో ఈయన తన తొలి టెస్టు శతకాన్ని సిక్సర్తో పూర్తి చేసి అరుదైన ఘనత సాధించాడు.
ఇది కేవలం ఆయనకే కాకుండా వెస్టిండీస్ క్రికెట్కు కూడా గర్వకారణంగా నిలిచింది. సోమవారం నాలుగో రోజు ఉదయం ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ స్లాగ్ స్వీప్ ఆడిన క్యాంప్బెల్ (John Campbell) ఆ సిక్సర్తో ఆయన తన మొదటి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
Jaggaiahpet: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట
ఓవర్నైట్ స్కోరు 87 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన 32 ఏళ్ల క్యాంప్బెల్, తన 48వ టెస్టు ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ సెంచరీతో భారత్లో 2002 తర్వాత శతకం నమోదు చేసిన తొలి వెస్టిండీస్ (West Indies) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అలాగే 2006 తర్వాత భారత్పై సెంచరీ చేసిన విండీస్ క్రికెటర్గా నిలిచాడు. రెండేళ్లకు పైగా కాలంలో ఒక వెస్టిండీస్ ఓపెనర్ సెంచరీ చేయడం కూడా ఇదే తొలిసారి.అయితే, శతకం తర్వాత క్యాంప్బెల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
మూడో వికెట్ భాగస్వామ్యానికి
మొత్తం 199 బంతుల్లో 115 పరుగులు చేసిన అతను, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బౌలింగ్లోనే రివర్స్ స్వీప్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 177 పరుగుల భారీ మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.క్యాంప్బెల్ ఔటయ్యే సమయానికి మరో ఎండ్లో షై హోప్ 75 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఫాలో ఆన్ ఆడుతున్నప్పటికీ, వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటూ పట్టుదల ప్రదర్శిస్తున్నారు. అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన విండీస్, ఈ మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: