వన్డే క్రికెట్లో దాదాపు ఏడు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడంతో క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ నడుస్తోంది. పెర్త్, అడిలైడ్ వేదికగా జరిగిన ఈ రెండు వన్డేల్లో కోహ్లీ శూన్య స్కోర్ చేయడం ఆయన కెరీర్లో మొదటిసారి కావడంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇదే అంశంపై జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Asia Cup: నఖ్వీ కి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ
ఓ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడిన రవిశాస్త్రి (Ravi Shastri), విరాట్ ఫామ్ అనే విషయం ఒక్కరాత్రిలోనే పోయేదీ కాదు, అలాగే ఒక్క మ్యాచ్తోా తిరిగి వచ్చేదీ కాదు అని స్పష్టం చేశారు. కోహ్లీ (Virat Kohli) చాలా సంవత్సరాలుగా భారత జట్టుకు ప్రధాన స్తంభంలా నిలిచాడని, ఆయనకు క్లాస్, అనుభవం ఉన్నాయనే విషయంపై ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అయితే ఫామ్ను తిరిగి పొందడానికి మ్యాచ్ ప్రాక్టీస్, మానసిక ఆత్మవిశ్వాసం, స్ట్రైక్ రోటేషన్ పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

ఇప్పటికే మూడు వన్డేల సిరీస్
ప్రస్తుతం కోహ్లీ (Virat Kohli) ఫుట్వర్క్ పరంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడని రవిశాస్త్రి (Ravi Shastri) అన్నారు. ఇలాంటి పరిస్థితి అతనికి చాలా అరుదుగా ఎదురవుతుందని పేర్కొన్నారు. వన్డేల్లో అతడు అద్భుతమైన రికార్డులు సాధించాడని, అయితే రెండు మ్యాచ్ల్లో పరుగులు చేయకుండానే వెనుదిరగడం అతనికి నిరాశ కలిగించి ఉంటుందని విశ్లేషించారు.
పెర్త్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో, అడిలైడ్లో జేవియర్ బ్రేట్లెట్ బంతికి ఎల్బీగా అవుటైన కోహ్లీ.. రెండు మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0తో కోల్పోయిన టీమ్ఇండియా, శనివారం సిడ్నీలో జరగనున్న మూడో వన్డేలో అయినా గెలిచి వైట్వాష్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: