Virat-Anushka: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. బృందావన్లోని కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లిన ఈ జంట, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహరాజ్ ఆశీస్సులు అందుకున్నారు.కోహ్లీ-అనుష్క దంపతులు దాదాపు గంటపాటు అక్కడే గడిపినట్లు తెలుస్తోంది.
Read Also: T World Cup 2026: టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్?

పలుమార్లు బృందావన్కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు
ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్ పుట్టినరోజు జరిగిన కొద్ది రోజులకే ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. గతంలోనూ ఈ జంట పలుమార్లు బృందావన్కు వచ్చి ప్రేమానంద మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. గతేడాది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం, నీమ్ కరోలీ బాబా ఆశ్రమం వంటి పుణ్యక్షేత్రాలను కూడా వారు సందర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: