న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై తెలంగాణ (TG) హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. నిన్న జరిగిన మూడో వన్డేలో ఓటమితో, మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-2 తేడాతో న్యూజిలాండ్కు సమర్పించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో కివీస్ చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే స్పందించిన సీవీ ఆనంద్, గత ఏడాది టెస్టు సిరీస్లోనూ 0-3 తేడాతో ఓడిపోయామన్న విషయాన్ని గుర్తుచేశారు.
Read Also: IND vs NZ: సంజయ్ మంజ్రేకర్పై వికాస్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు
భారత క్రికెట్లో అసలు ఏం జరుగుతోంది??
ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు మనది. టీ20లు, వన్డేలు, లాంగ్ ఫార్మాట్లను కవర్ చేస్తూ ఏడాది పొడవునా దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉంది. అపారమైన ప్రతిభ అందుబాటులో ఉంది! అయినా, మధ్యలో ఒక టీ20 ప్రపంచ కప్ గెలవడం మినహా మనం అన్నీ కోల్పోతున్నట్లు అనిపిస్తోంది!
దీనికి కారణం ఐపీఎల్ డబ్బా? ఆటగాళ్లలో టెంపర్మెంట్ లోపమా? పక్షపాతంతో కూడిన సెలక్షన్లా? లేక గౌతమ్ గంభీర్ కోచ్గా ఉండటమా?” అంటూ ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: