Shami: టీమిండియా(Team India) పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భార్య హసీన్ జహాన్తో కొనసాగుతున్న వివాదాలపై మొదటిసారిగా బహిరంగంగా మాట్లాడారు. ఎన్నేళ్లుగా తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, గతం గురించి తాను ఆలోచించనని, తన దృష్టి మొత్తం క్రికెట్పైనే ఉందని స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ప్రశ్నలకు సమాధానమిస్తూ, “గతం గురించి బాధపడడం నేను ఇష్టపడను. ఏమి జరిగిందో అది జరిగిపోయింది. నేను ఎవరినీ తప్పుపట్టను, నన్ను నేనూ నిందించను. ఇప్పుడు నాకు ముఖ్యమైనది క్రికెట్ మాత్రమే. వివాదాలకన్నా నా కెరీర్ను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం” అని స్పష్టం చేశారు.

వ్యక్తిగత జీవితంపై షమీ స్పందన
2014లో హసీన్ జహాన్తో వివాహం చేసుకున్న షమీ, నాలుగేళ్లకే విభేదాల కారణంగా వేరు అయ్యారు. 2018 నుంచి ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. ఆ తర్వాత నుంచి షమీపై హసీన్ జహాన్(Hasin Jahan) అనేక ఆరోపణలు చేశారు. గృహహింస, మానసిక వేధింపులు వంటి ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఇటీవల కూడా షమీపై ఆమె విమర్శలు గుప్పించడమే కాకుండా, ఆయన వ్యక్తిత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం షమీ క్రికెట్పైనే దృష్టి సారించారు. బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నారు. అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షమీ 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచారు. ఫామ్ కోల్పోవడంతో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కి, రాబోయే ఆసియా కప్ 2025కి ఎంపిక కాలేదు.
మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం గురించి ఏమని చెప్పారు?
ఆయన గతాన్ని పట్టించుకోనని, క్రికెట్పైనే దృష్టి పెట్టాలని తెలిపారు.
షమీ మరియు హసీన్ జహాన్ ఎప్పుడు విడిపోయారు?
వారు 2018 నుంచి వేరుగా ఉంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: